కేంద్ర మంత్రులతో మంత్రి జూపల్లి భేటీ

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ తో సమావేశం

Update: 2024-08-24 10:33 GMT

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్, నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. షెకావత్‌ తో భేటీలో తెలంగాణలో టూరిజం అభివృద్ధికి సహకరించాలని కోరారు. నితిన్‌ గడ్కరీతో భేటీలో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాతో పాటు కొల్లాపూర్‌ నియోజకవర్గంలో చేపట్టాల్సిన నేషనల్‌ హైవేస్‌, ఇతర అభివృద్ధి పనులపై చర్చించారు. ఆయా పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని జూపల్లి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ తోనూ జూపల్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి, ప్రతిపక్షాల ఆందోళనలు, రైతు రుణమాఫీ, కాంగ్రెస్‌ మేనిఫెస్టో అమలు సహా ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది.

Tags:    

Similar News