పర్యాటక భవన్ అధికారులపై మంత్రి జూపల్లి ఫైర్
పర్యటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆఫీసులో హాజరు పట్టిక, బయోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు
By : Vamshi
Update: 2024-06-20 11:08 GMT
హైదరాబాద్ పర్యటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆఫీసులో హాజరు పట్టిక, బయోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోవడం, హాజరుశాతం తక్కువగా ఉండటంపై మంత్రి ఆగ్రహించారు. ప్రతీ ఫ్లోర్ తిరిగి ఉద్యోగులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనం ఇవ్వడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సమయానికి రాకపోవడం, సెలవులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు