ఉజ్జయిని మహంకాళి బోనాలకు మంత్రి సురేఖకు ఆహ్వానం అందజేత

ఈ నెల 21 నుంచి జరిగే ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాలకు మంత్రి కొండా సురేఖకి ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికను అందించారు

By :  Vamshi
Update: 2024-07-11 09:59 GMT

ఈ నెల 21 నుంచి జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకి ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ప్రధాన అర్చకులు ఆహ్వాన పత్రికను అందించారు. హన్మకొండ రాంనగర్ లోని వారి నివాసంలో కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ప్రధాన అర్చకులు ఆహ్వాన పత్రికను చదివి వినిపించారు.

అర్చకులు మంత్రికి వేదాశీర్వాచనాలు అందించి, అమ్మవారి శేష వస్త్రాలు ప్రదానం చేశారు. జూలై 21, 22వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. 21న బోనాల జాతర, 22న రంగం, అంబారి అమ్మవారి ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News