సీఎం రేవంత్‌రెడ్డిను కలిసిన మందకృష్ణ మాదిగ

సీఎం రేవంత్‌రెడ్డితో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రికి కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు.

By :  Vamshi
Update: 2024-08-22 07:35 GMT

సీఎం రేవంత్‌రెడ్డితో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రికి కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. అయితే.. కేంద్ర కాంగ్రెస్‌ పార్టీ మాత్రం దీనిపై నాన్చుడు ధోరణితో ఉంది. ఇటీవల అసెంబ్లీలో వర్గీకరణ చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ,కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News