లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా జహీర్ ఖాన్
టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ను లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్గా ప్రకటించింది. ఆ ఫ్రాంచైజీ తాజాగా ఎక్స్ వేదికగా వీడియోను విడుదల చేసింది.
టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ను లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్గా ప్రకటించింది. ఆ ఫ్రాంచైజీ తాజాగా ఎక్స్ వేదికగా వీడియోను విడుదల చేసింది. గత ఐపీఎల్లో జహీర్ ముంబై ఇండియన్స్కి వివిధ హోదాలో పని చేశారు. ఇక జహీర్ ఖాన్ తన ఐపీఎల్ కెరీర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 100 మ్యాచ్లు ఆడి 102 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ముంబైకి కోచింగ్ స్టాఫ్గా పనిచేశాడు. ఇప్పుడు మెంటార్ అవతారంలో కనిపించనున్నాడు..
గంభీర్ ఆధ్వర్యంలో లక్నో 2022, 2023 ఐపీఎల్ సీజన్లలో ప్లేఆఫ్స్కు చేరింది. తర్వాత గౌతమ్ కోల్కతా నైట్రైడర్స్కు మెంటార్గా వెళ్లాడు. దీంతో ఆ ప్రభావం ఎల్ఎస్జీ ప్రదర్శనపై పడింది. గత సీజన్లో లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరలేకపోయింది. పైగా మొన్నటివరకు బౌలింగ్ కోచ్గా ఉన్న మోర్నీ మోర్కెల్ ఇప్పుడు సహాయక సిబ్బందిలో లేడు. మోర్కెల్ ఇటీవల టీమిండియా బౌలింగ్ కోచ్గా నియమితుడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంతో అనుభవమున్న జహీర్ ఖాన్ను లఖ్నవూ మెంటార్గా చేర్చుకుంది.