ఎల్‌కే అద్వానీకి అస్వస్థత...ఎయిమ్స్‌లో చేరిక

మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ వృద్ధాప్య సమస్యలతోోో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.

By :  Vamshi
Update: 2024-06-27 05:05 GMT

మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతుంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి ఎయిమ్స్‌లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు. అద్వానీకి యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన హెల్త్ కండిషన్‌ని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అద్వానీ వయస్సు 96 ఏళ్ల కాగా.. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. భారతీయ జనతా పార్టీలో అద్వానీ అత్యంత సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు.

1927 నవంబర్ 8న కరాచీ (ప్రస్తుత పాకిస్థాన్)లో జన్మించిన అద్వానీ.. 1942లో స్వయం సేవక్‌ సంఘ్‌లో (RSS)లో చేరారు. బీజేపీకి అత్యధిక కాలం జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. 1986-1990 వరకు, 1993-1998 వరకు, 2004 -2005 వరకు అద్వానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు. అటల్ బిహారీ వాజ్‌పేయూ ప్రధానిగా ఉన్న సమయంలో 1999-2004 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. 2002-2004 మధ్య ఉప ప్రధానమంత్రిగానూ సేలవందించారు. గత ముడు నెలల క్రితం ఆయనను కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డుతో సత్కరించింది.

Tags:    

Similar News