లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని.. తుడుం దెబ్బ బంద్‌

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ తుడుం దెబ్బ, ఏజేన్సీ సంఘాలు ఆదిలాబాద్‌ జిల్లా బంద్‌ కొనసాగుతుంది

By :  Vamshi
Update: 2024-08-27 06:35 GMT

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తు తుడుం దెబ్బ, ఏజేన్సీ సంఘాలు పిలుపు మేరకు ఆదిలాబాద్‌ జిల్లా బంద్ కొనసాగుతుంది. తుడుం దెబ్బ పిలుపు మేరకు ఏజెన్సీ నాయకులు ఆదిలాబాద్‌ ఆర్టీసీ బస్‌ డిపో ఎదుట బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక బంద్‌ నేపథ్యంలో దుకాణాలు తెరచుకోలేదు.జీవో 3ను యథావిధిగా కొనసాగించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేశ్‌ డిమాండ్ చేశారు. వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా ఏజెన్సీ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కాగా, ఎస్టీ జాబితా నుంచి లంబాడీ సామాజికవర్గాన్ని తొలగించి అడవి తల్లిపై ఆధారపడి జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని గిరిజనులు అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీగా ఉన్న ఆ సామాజికవర్గం, తెలంగాణలో ఎస్టీ జాబితాలో కొనసాగుతుండటం వల్ల ఆదివాసీలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ వర్గీకరణతోనే రాష్ట్రంలో ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ సంఘాలు తెలిపాయి. సుప్రీం తీర్పును అనుసరించి ఎస్టీ జాబితాలోని తెగలను జనాభా ప్రాతిపదికన వర్గీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతల్లోని గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఐటీడీఏలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేయాలని తుడుం దెబ్బ నేతలు కోరారు

Tags:    

Similar News