కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయంలో కేటీఆర్‌ పూజలు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన కొనసాగుతున్నది.

By :  Raju
Update: 2024-07-26 06:18 GMT

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన కొనసాగుతున్నది. రెండో రోజుల పర్యటనలో భాగంగా రామగుండం నుంచి మేడిగడ్డకు వెళ్లారు. ఈ బృందం నిన్న రామగుండంలో బస చేసింది. ఈ ఉదయం బయలుదేరుతూ మార్గమధ్యలో మంచిర్యాల జిల్లాల ఇందారం వద్ద గోదావరి నదిని పరిశీలించారు.

అనంతరం కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో కేటీఆర్‌ బృందానికి స్వాగతం పలికారు. గోదావరి నిదలోకి పూలు చల్లారు. ఆలయ దర్శనం అనంతరం కన్నెపల్లికి వెళ్లారు. రాష్ట్రం చల్లగా ఉండాలని అందరూ బాగుండాలని స్వామి వారిని కోరుకున్నట్లు బీఆర్ఎస్ నేతల తెలిపారు.కన్నెపంప్‌ హౌజ్‌ను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ పరిశీలిస్తారు. 

Tags:    

Similar News