గురుకుల బ్యాక్‌లాగ్ పోస్టులను తదుపరి మెరిట్ ప్రకారం భర్తీ చేయాలి : కేటీఆర్

గురుకుల పోస్టులలో భర్తీ కాకుండా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థుల్లో భర్తీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

By :  Vamshi
Update: 2024-08-13 13:46 GMT

గురుకుల పోస్టులలో భర్తీ కాకుండా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థుల్లో భర్తీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ గురుకుల అభ్యర్థులు ఇవాళ కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలసి వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను వాటి పరిష్కారాలను అంశలను కేటీఆర్‌కి వివరించారు. గురుకుల బోర్డు చేపట్టిన నియమాకాలలో డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయడం ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. గురుకుల బోర్డు చేపట్టిన నియమాకాలలో 9024 పోస్టులలో డిసేన్డింగ్ ఆర్డర్ పాటించకపోవడం చాలామంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం మూలంగా సెకండ్ మెరిట్ లో ఉన్న వారికి నష్టం జరుగుతున్నదని తెలిపారు.

గురుకుల పోస్టులలో భర్తీ కాకుండా మిగిలిపోతున్నటువంటి పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థుల్లో భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని దీని కోసం ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గురుకుల విద్యార్థులు కేటీఆర్‌కి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు జీవో ఎంఎస్ నెంబర్ 81ను సవాల్ చేస్తూ ఐదు మభ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం తరుపున జీవో ఎంఎస్ నెంబర్ 81ను అడ్డంకిగా చూపిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంత ఉత్తరాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని మాజీ మంత్రికి తెలపారు. గతంలో టీఎస్ ట్రాన్స్కో, టిఎస్ ఎస్పీడీసీఎల్ మరియు టీఎస్ ఎన్పీడీఎస్ నిర్వహించిన వివిధ నోటిఫికేషన్లలో ప్రస్తుతం గురుకులాల్లో ఏర్పడుతున్నట్టుగానే భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడే ప్రమాదం ఉన్నప్పుడు నిరుద్యోగులు నష్టపోకుండా ఉండడం కోసం జీవో ఎంఎస్ నెంబర్ 81 అమలు చేయకుండా వన్ టైం రిలాక్సేషన్ కల్పించి పోస్ట్ మిగిలిపోకుండా డౌన్ మెరిట్ ఆపరేట్ చేసి తదుపరి మెరిట్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు.

గతం లాగానే ఈ గురుకుల పోస్టుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని దాని కోసం బీఆర్‌ఎస్ పార్టీగా ప్రతిపక్ష నాయకులుగా రాష్ట్రంలో ఉన్న గురుకుల తో పాటు డీఎస్సీ అభ్యర్థుల అనేకమంది న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని మీరందరికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.కేటీఆర్ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా గురుకుల విద్యార్థులకు & డీఎస్సీ విద్యార్థుల తరఫున బిఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా మీకు అండగా నిలుస్తుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఫోన్ చేసి వీరి సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని ఇందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల నిరుద్యోగ విద్యార్థులు రత్న శేఖర్ రెడ్డి, స్వాతి తో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, విద్యార్థి విభాగం నాయకులకు గెల్లు శ్రీనివాసు తో పాటు నిరుద్యోగ విద్యార్థులు దామోదర్ రెడ్డి, విక్రమ్ తదితర నిరుద్యోగ విద్యార్థులు ఉన్నారు.

Tags:    

Similar News