కోల్కతా ఘటన కలిచివేసింది: పొన్నం
విధులు నిర్వహిస్తూ నిరసన తెలుపాల్సింది మంత్రి విజ్ఞప్తి
By : Raju
Update: 2024-08-18 07:11 GMT
కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన కలిచివేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఘటన అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశం మొత్తం అండగా నిలిచి బాధ్యులకు శిక్ష పడేవరకు పోరాడాలన్నారు. డాక్టర్ల నిరసనకు సంఘీభావం తెలుపుతున్నామన్న పొన్నం విధులు నిర్వహిస్తూ నిరసన తెలుపాల్సింది విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ హాస్పత్రులు వైద్యులు ఓపీ, అత్యవసర సేవలు బంద్ చేసి నిరసనలు వల్ల రోగులు ఇబ్బంది పడ్డారని తెలిపారు.