స్మితా సబర్వాల్‌ కామెంట్స్‌పై కోదండరాం ఫైర్

ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. దివ్యాంగులపై ఆమె చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు

By :  Vamshi
Update: 2024-07-26 11:12 GMT

దివ్యాంగులపై సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్‌పై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఫైర్ అయ్యారు. దివ్యాంగులు కొన్ని ఉద్యోగాలకు పనికి రారన్న ఆమె వ్యాఖ్యలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమన్నారు. అంగ వైకల్యం పేరుతో వారి హక్కులను దారుణమన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన సివిల్ సర్వెంట్లు లోపాన్ని కించపరచడం సరికాదన్నారు.

తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం ప్రకటించకపోగా... ఇంకా వాటిని సమర్థించుకోవడం దారుణమని స్మితా సబర్వాల్‌పై మండిపడ్డారు. సమాజం ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు రాకుండా ప్రభుత్వం చూడాలన్నారు. వాళ్లు సకాలంగుల కంటే ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి’’అని కోదండరాం అన్నారు.

Tags:    

Similar News