ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణం

తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారితో ప్రమాణం చేయించారు.

By :  Raju
Update: 2024-08-16 05:04 GMT

ఎట్ట‌కేల‌కు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్ అలీఖాన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌లకు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. కోదండరాం తెలంగాణ ఉద్యమంలో జేఏసీ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించగా.. అమీర్‌ అలీఖాన్‌ సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు.

అమరవీరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తా:కోదండరామ్‌

ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం కోదండరామ్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కావడం అదనపు బాధ్యత మాత్రమే అని భావిస్తున్నాను. ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తాను అన్నారు. 

Tags:    

Similar News