విద్యుత్‌ కమిషన్‌పై సుప్రీంకోర్టులో కేసీఆర్‌ పిటిషన్‌

జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ సమన్లపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రేపు విచారణకు రానున్నది.

By :  Raju
Update: 2024-07-14 16:27 GMT

తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.జస్టిస్‌ నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని ఇటీవల కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేసీఆర్‌ సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు.

కేసీఆర్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సోమవారం సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం  విచారణ చేపట్టనున్నది.

Tags:    

Similar News