ఆర్చరీ విభాగంలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన దీపికా

పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో భారత ఆర్చర్ దీపికా కుమారి క్వార్టర్స్‌ ఫైనల్ చేరుకున్నారు.

By :  Vamshi
Update: 2024-08-03 09:18 GMT

పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో భారత ఆర్చర్ దీపికా కుమారి క్వార్టర్స్‌ ఫైనల్ చేరుకున్నారు. జర్మనీకి చెందిన మిచెల్ క్రాప్పెన్‌ను 6-4 అధిక్యంతో ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. మంగళవారం ఎస్తోనియా ఆర్చర్ రీనాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో దీపిక 65 తేడాతో విజయం సాధించింది. మొదటి నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ప్రతికూల వాతావరణంలో విజయం కోసం ఇద్దరు తీవ్రంగా శ్రమించారు.

ఇటు దీపిక అటు రీనా కూడా సర్వం ఒడ్డారు. దీంతో మ్యాచ్‌లో ఉత్కంఠ తప్పలేదు. అయితే తీవ్ర ఒత్తిడిలోనూ దీపిక అద్భుత ఆటను కనబరిచింది. ఒలింపిక్స్‌లో భారత హాకీలో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్న ఆస్ట్రేలియా పై 3-2 తేడాతో విజయం అందుకున్నారు. ఆట ప్రారంభమైన కాసేపటికే వరుస గోల్స్ చేసిన భారత జట్టు హాఫ్ టైం అయ్యేసరికి 2-1 తో లీడ్ లో ఉంది. ఆ తర్వాత మరో గోల్ చేసి లీడ్ ను పెంచుకున్న టీమిండియా చివరి వరకు ఆ లీడ్ ను కాపాడుకుంది. అయితే చివరి 5 నిమిస్సాగాల్లో ఆసీస్ గోల్ చేసిన భారత్ 3-2 తేడాతో విక్టరీ సాధించి నాకౌట్ స్టేజ్ కు చేరుకుంది.

Tags:    

Similar News