సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం : చంద్రబాబు
గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ఏపీ సీఎం చంద్రబాబు
గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించడానికి కట్టుబడి ఉన్నామని, ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 100 రోజుల ప్రణాళిక టార్గెట్గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమంగా నిలాం. రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలకు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించామని సీఎం చెప్పారు.