ఒలింపిక్స్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్‌ గెలుపు రద్దు

ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుడి గెలుపు రద్దైపోయింది

By :  Vamshi
Update: 2024-07-29 04:25 GMT

భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ గ్రూప్ దశలో షట్లర్ లక్ష్య సేన్‌ సాధించిన విజయాన్ని రద్దైపోయింది. ప్రత్యర్థి ఆటగాడు అనూహ్యంగా పోటీ నుంచి వైదొలగటంతో ఒలింపిక్స్ నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేస్.. గ్వాటమాలాకు చెందిన కెవిన్ కోర్డన్‌తో తలపడ్డాడు. 21-8, 22-20 తేడాతో వరుస సెట్లలో పైచేయి సాధించి విజయం అందుకున్నాడు.

తొలి సెట్‌లో మొదటి నుంచి లక్ష్య సేన్ పైచేయి సాధించగా రెండో సెట్‌లో ఆట పోటాపోటీగా సాగింది. చివరకు లక్ష్య సేన్ స్వల్ప తేడాతో విజయం సాధించాడుఅయితే, మణికట్టు గాయం కారణంగా కార్డన్ ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో, గ్రూప్‌ ఎల్‌లో ఇండోనేషియా, బెల్జియం క్రీడాకారులతో తదుపరి జరగనున్న మ్యాచులు రద్దైపోయాయి. ఈ నేపథ్యంలో లక్ష్య సేన్ గెలుపును కూడా రికార్డుల నుంచి తొలగించారు. తదుపరి మ్యాచుల ఆధారంగా సేన్ ర్యాంకు, స్కోరును నిర్ణయిస్తారు.

Tags:    

Similar News