పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌‌కు గోల్డ్ మెడల్ వరించింది. స్టార్ పారా షూటర్ అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

By :  Vamshi
Update: 2024-08-30 11:04 GMT

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌‌కు గోల్డ్ మెడల్ వరించింది. స్టార్ పారా షూటర్ అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. దాంతో రెండోరోజు భారత్ పతకాల జాబితాలో ఖాతా తెరిచినట్లయింది. పారాలింపిక్స్‌లో అవనీ వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లెఖారా 249.6 స్కోర్‌ చేయగా..

ఈ ఒలింపిక్స్‌లో 249.7 స్కోర్‌ చేసి తన రికార్డును తానే తిరగరాసింది. మోనా అగర్వాల్‌ ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. పారాలింపిక్స్‌ షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో భారత్‌కు చెందిన ఇద్దరు మహిళా పారా షూటర్‌లు అవని లెఖారా మోనా అగర్వాల్‌ చెరో పతకం సాధించారు.

Tags:    

Similar News