అవయవ దానం చేస్తే.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

అవయదానం చేసిన వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

By :  Vamshi
Update: 2024-08-08 14:51 GMT

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయదానం చేసిన వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల్లో అవయవ దానంపై అవగాహన కల్పించి, బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను అవసరార్ధులకు అమర్చడం ద్వారా . వారికి పునర్జన్మను ఇచ్చే జీవన్‌దాన్ కార్యక్రమంలో భాగంగా అవయవ దాతల అంతిమ సంస్కారాలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఆర్డీవో స్థాయికి తక్కువ కాని అధికారుల నేతృత్వంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అవసరమైన నియమావళిని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 

Tags:    

Similar News