తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతుండటంతో జైలు అధికారులు ఆమెను వైద్య చికిత్స కోసం దీన్దయాల్ ఆస్పత్రికి తరలించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలతో కవిత సుమారు నాలుగు నెలలుగా జైలులోనే ఉన్నారు.