హైడ్రా పేరుతో ప్రజల ఇండ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు : ఎమ్మెల్యే కూనంనేని

సమాజంలో కమ్యూనిస్టులు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి చెయ్యాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబ శివరావు డిమాండ్ చేశారు

By :  Vamshi
Update: 2024-08-25 07:59 GMT

ఎర్ర జెండా పార్టీ రేవంత్ సర్కార్‌కి షాక్ ఇచ్చింది. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరింది. అలాగే హైడ్రా విషయంలో సామాన్యుల ఇండ్ల జోలికి పోవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబ శివరావు కోరారు. హనుమకొండలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు రూ.70వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చెయ్యాలి. ప్రతి అన్నదాతకు న్యాయం చెయ్యాలన్నారు.

రుణమాఫీ విషయంలో పిచ్చి పిచ్చి సాకులు చెప్పవద్దు. రైతుల కోపానికి గురికాకముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రైతుల వెంట ఎల్లప్పుడూ కమ్యూనిస్టు అండగా ఉంటుదని స్పష్టం చేశారు. సమాజంలో కమ్యూనిస్టులు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. హస్తం ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి చెయ్యాలన్నారు. సాంబశివరావు కామెంట్స్‌తో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్నారు. కొత్తగుడెం ఎమ్మెల్యేగా కునంనేని హస్తం పార్టీ అండతోనే గెలిచారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి

Tags:    

Similar News