రుణమాఫీ చేయలేదంటే అన్నదాతలను అరెస్టు చేస్తారా ?నిరంజన్ రెడ్డి

అధికార పీఠం ఎక్కగానే కాంగ్రెస్ నేతల కండ్లు నెత్తిమీదికెక్కాయి. రాబోయే రోజుల్లో రైతులే ఈ ప్రభుత్వానికి పాడె కడతారు మండిపడ్డ నిరంజన్‌రెడ్డి

By :  Raju
Update: 2024-08-19 05:59 GMT

ఆదిలాబాద్ జిల్లాలో రుణమాఫీ కాలేదని శవయాత్ర చేసిన 11 మంది రైతులను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నది రైతు రాజ్యం కాదు .. పోలీసు రాజ్యమని ధ్వజమెత్తారు. నిరసన అనేది ప్రజాస్వామిక హక్కు .. అణచివేస్తే ఆగిపోతుంది అనుకోవడం అవివేకం అన్నారు.

రూ.15000 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టి రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసి 2 లక్షల వరకు రుణాలు తీర్చేశామని చెప్పుకున్నారు.మరి అన్ని రుణాలు మాఫీ అయితే ప్రభుత్వానికి ఉలుకెందుకు ? రాష్ట్రంలో రైతులు రోడ్డెందుకు ఎక్కుతున్నారు ?అని మాజీ మంత్రి ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ పూర్తయిందని సీఎం, మంత్రుల అబద్దపు ప్రకటనల కారణంగానే రైతులు ఆందోళనకు గురై నిరసనలు తెలుపుతున్నారు.

అధికార పీఠం ఎక్కగానే కాంగ్రెస్ నేతల కండ్లు నెత్తిమీదికెక్కాయి. రాబోయే రోజుల్లో రైతులే ఈ ప్రభుత్వానికి పాడె కడతారు మండిపడ్డారు.ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, రైతుకూలీలు, మహిళలు అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని విమర్శించారు.రైతుల మీద పెట్టిన కేసులను భేషరతుగా వెనక్కి తీసుకోవాలి . అరకొర రుణమాఫీ చేసి రైతుల ఆందోళనకు, మానసిక వేదనకు కారణమైన కాంగ్రెస్  ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్‌ చేశారు

Tags:    

Similar News