ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు భారీగా పెంపు

పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Byline :  Vamshi
Update: 2024-06-14 06:33 GMT

ఏపీ ప్రభుత్వం పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు. పెన్షన్ల పెంపు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్య్సకారులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి పెంఛన్లు పెరిగాయి.

గత వైసీపీ ప్రభుత్వం వైఎస్సాఆర్ ఆసరా పెన్షన్ అని పేరు పెట్టగా తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఎన్డీఆర్ భరోసాగా పునరద్ధరిస్తూ జీవో విడుదల చేశారు. పెరిగిన పెన్షన్ల ప్రకారం.. వృద్ధులు, వితంతువులు, చేనేత, మత్స్యకారులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారికి రూ.10 వేలు, పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15 వేల పెన్షన్ ప్రభుత్వం అందించనుంది. జులై 1న అమల్లోకి రానున్నది

Tags:    

Similar News