ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలి: సీఎం చంద్రబాబు

ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు సీఎం చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. విజయవాడ కలెక్టరేట్‌లో వరద పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు.

By :  Raju
Update: 2024-09-02 04:00 GMT

ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు సీఎం చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. విజయవాడ కలెక్టరేట్‌లో వరద పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ..హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలన్నారు. ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలన్నారు. ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదన్నారు. బోట్లో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు సిద్ధంగా ఉంచాలన్నారు. అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలోనే ఉంచాలని చంద్రబాబు తెలిపారు.

అంతకుముందు ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. జోరు వర్షంలోనూ బోటు ఎక్కి విజయవాడ సింగ్‌ నగర్‌కు వెళ్లారు. దాదాపు వంతెనను ఆనుకుని ప్రవహిస్తున్న నీటిని సీఎం పరిశీలించారు. బాధితులకు ఉదయమే ఆహారం అందిందా అని ఆరా తీశారు. 

Tags:    

Similar News