రాఖీకి కూడా భయపడితే ఎలా?..కేటీఆర్‌ ట్వీట్

ఈరోజు మహిళా కమిషన్ ముందు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు ఇవ్వాల్సిందిగా మహిళా కమిషన్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసిన మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద.

By :  Vamshi
Update: 2024-08-24 15:56 GMT

తనకు రాఖీ కట్టిన మహిళ కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. చేతి నిండా రాఖీలతో ఉన్న ఫోటోను ఎక్స్‌లో పోస్ట్ చేసి రాఖీకి కూడా భయపడితే ఎలా అని క్యాప్షన్ ఇచ్చారు. శనివారం మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ముందు కేటీఆర్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆఫీసు ప్రాంగణంలోనే ఆరుగురు కమిషన్ మెంబర్లు ఆయనకు రాఖీ కట్టడాన్ని చైర్‌పర్సన్ క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించారు. న్యాయ నిపుణుల నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకున్న ఆమె.. రాఖీ కట్టిన ఆరుగురు సభ్యురాళ్ళకు నోటీసులు జారీ చేయాల్సిందిగా కమిషన్ సెక్రెటరీని ఆదేశించారు.

Tags:    

Similar News