జుబ్లీహిల్స్‌ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని.. హీరో రాజశేఖర్ ట్వీట్

జుబ్లీహిల్స్‌లో మురుగు నీటి సమస్యపై సత్వర పరిష్కారం చూపాలని సినీ హీరో రాజశేఖర్ ఎక్స్‌ వేదికగా జీహెచ్‌ఎంసీని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ పెట్టారు.

By :  Vamshi
Update: 2024-07-29 11:38 GMT

హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 70లో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రముఖ హీరో రాజశేఖర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇక్కడి అశ్వినీ హైట్స్ నుంచి డ్రైనేజీ లీకేజీ సమస్య ఎప్పటి నుంచో వేధిస్తోందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని తాము జీహెచ్ఎంసీకి ఎప్పుడో ఫిర్యాదు చేశామని, కానీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ ఆన్‌లైన్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు.మురుగు సమస్యపై సత్వర పరిష్కారం చూపాలని ఆయన ఎక్స్‌ వేదికగా జీహెచ్‌ఎంసీని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ పెట్టారు.

Tags:    

Similar News