జిట్టా పార్థివ దేహానికి నివాళులర్పించిన హరీశ్ రావు
బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పార్థివ దేహానికి మాజీ మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. జిట్టా కుటుంబ సభ్యులను ఓదార్చారు.
బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పార్థివ దేహానికి మాజీ మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. జిట్టా కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాలకృష్ణారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సైతం నివాళులు అర్పించారు. హరీశ్ రావు వెంట బీఆర్ఎస్ శాసన సభ్యులు, ఇతర నాయకులు ఉన్నారు.
కాగా, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి.. 50 రోజులుగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పట్టణ శివార్లలోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న తమ ఫామ్హౌస్లో అంతక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.