సిరాజ్‌, జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగాలు..కేబినెట్ నిర్ణయం

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శాసన సభలో కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ భేటీలో జాబ్ క్యాలెండర్, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్‌కు గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలాలు వంటి వాటిపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు.

By :  Vamshi
Update: 2024-08-01 12:19 GMT

తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌, బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 క్యాడర్ డీఎస్పీ ఉద్యోగాలు, ఇంటి స్థలాలు ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ సాధించిన జట్టులో సిరాజ్‌ సభ్యుడు. కప్ సాధించిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.భారత జట్టులో మన రాష్ట్రానికి చెందిన ఆటగాడు ఉండటం గర్వకారణం అని సీఎం ప్రశంసించి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్‌కు సైతం ఇంటి స్థలం, గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ కేబినెట్‌లో ఈ అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన అసెంబ్లీలో కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ భేటీలో జాబ్ క్యాలెండర్, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు, జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్న ఔటర్ లోపలి మున్సిపాలిటీలు, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణ, రైతు భరోసారి విధివిధానాలు వంటి 45 అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. 

Tags:    

Similar News