యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్‌

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

By :  Vamshi
Update: 2024-08-27 04:34 GMT

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు.

 


ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గవర్నర్‌కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందచేశారు. యాద్రాదిలో ప్రభుత్వ తరుపున ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈవో భాస్కరరావు, స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ జనగామ, వరంగల్, ములుగు జిల్లాల పర్యటనకు వెళ్లారు

Tags:    

Similar News