ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్

తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఏపీలో పర్యటించారు. ఉండవల్లిలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు.

By :  Vamshi
Update: 2024-06-28 09:15 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇద్దరు భేటీయ్యారు. తెలుగు రాష్ట్రల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ని మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో ఆయనను సత్కరించారు.

సీఎం చంద్రబాబు అభివృద్ధిపై అవగాహన ఉన్న వ్యక్తి అని గవర్నర్ అన్నారు. అనంతరం విజయవాడ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో గవర్నర్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు అధికారులు. అటు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ వేద పండితులు… అమ్మవారి దర్శనానంతరం తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కు వేదాశీర్వచనం చేశారు.

Tags:    

Similar News