ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020 ఆగస్ట్ 26 కంటే ముందు రిజిస్టర్ చేసిన లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని నియమనిబంధనలు జారీ చేసింది.
అనుమతి లేని చట్టవిరుద్దమైన లేఔట్లకే క్రమబద్ధీకరణకు తెలంగాణ సర్కార్ విధివిధానలు జారీచేసింది. 2020 ఆగస్ట్ 26 కంటే ముందు రిజిస్టర్ చేసుకున్న లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. 2020 అక్టోబర్ 15వ తేదీలోగా స్వీకరించిన దరఖాస్తులనూ పరిగణలోకి తీసుకుంటామని మున్సిపాలిటీ, పట్టణభివృద్ధి శాఖ వెల్లడించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులకు సందేహాలుంటే హెల్ప్డెస్క్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 4.28 లక్షలకు పైగా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు తెలిపారు.
ఎల్ఆర్ఎస్కు 60,213 దరఖాస్తులు ఆమోదం పొందగా, 96.60 లక్షలు వసూలైనట్లు చెప్పారు. 75 శాతం దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వలేదన్నారు. అన్ని డాక్యుమెంట్లు ఇవ్వని దరఖాస్తుదారులకు ఇప్పటికే ఈ విషయం తెలియజేశామన్నారు. వాటిని అప్ లోడ్ చేయలేకపోయామని, అందుకే సకాలంలో ప్రాసెస్ కాలేదన్నారు. పూర్తి డాక్యుమెంట్లను సమర్పించేందుకు వారికి గడువు ఇచ్చినట్లు చెప్పారు. సేల్ డీడ్, మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్, లేఔట్ కాపీలను అప్ లోడ్ చేయవచ్చునన్నారు. మొబైల్ నెంబర్, చిరునామా, ఇతర వివరాలతో పాటు ఓటీపీని ఉపయోగించి సవరించుకోవాలని సూచించారు.