ఎక్స్ప్రెస్ రైలును ఢీకొన్న గూడ్స్..పలువురికి గాయాలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సిలిగురిలో కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది.
By : Vamshi
Update: 2024-06-17 05:18 GMT
పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డార్జీలింగ్ జిల్లాలోని న్యూజల్సయిగుడిలో రెండు రైళ్లు ఢీకొట్టింది. కాంచన గంగ ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Also Read - గాజాలో ఇజ్రాయిల్ వైమానిక దాడి.. 39 మంది మృతి
ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.కాంచనజంగా ఎక్స్ప్రెస్ సీల్దా వెళ్తున్న క్రమంలో రంగపాణి, నిజబరి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.