ఆగస్టు 5 నుంచి 10 వరకు..గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు

వచ్చే నెల 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది.

By :  Vamshi
Update: 2024-07-26 08:59 GMT

ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్ ప్రకటించింది. వచ్చే నెల 5నుంచి 10 వరుకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. వీటితో పాటు పలు రైళ్ల సేవలను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నాది. విజయవాడ డివిజన్ పరిధిలో మూడో లైన్, సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంలో పనుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ రెండు రైళ్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఈ నెల 29, 31 తేదీల్లో రద్దు చేసినట్లు వెల్లడించింది. వీటితోపాటు సికింద్రాబాద్‌-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా ఈ సర్వీసులను కొన్నిరోజులపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని దౌండ్‌ మార్గంతో పాటు దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో మూడో లైను పనుల కారణంగా ప్రయాణికులకు రైళ్ల సేవల్లో అంతరాయం కలగుతుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్-ముంబాయి మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ ఈ నెల 30న ముంబాయి-సింద్రాబాద్ మధ్య నడిచే ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ ఈనెల 31న రద్దయింది. విజయవాడ-భద్రాచలం రోడ్, డోర్నకల్-విజయవాడ మధ్య రైళ్లు సైతం ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు రద్దయ్యాయి .ఆదిలాబాద్-తిరుపతి మధ్య కృష్ణా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గూడురు మధ్య తిరిగే సింహపురి, హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య తిరిగే గోదావరి రైళ్లను దారి మళ్లించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

Tags:    

Similar News