మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కన్నుమూత
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు.
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ధ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ఉట్నూర్ కు తరలించారు. రాథోడ్ రమేశ్ మృతిపై పలువురు నేతలు విచారం వ్యక్తం చేస్తూ సంతాపాన్నితెలిపారు. వారి కటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ ఛైర్మన్గానే కాకుండా లోక్సభ ఎంపీగా రమేశ్ పనిచేశారు. టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ల్లో ఆయన కీలక నేతగా పనిచేశారు. ఆయన స్వస్థలం నార్నూర్మండలం తాడిహాత్నూర్.
రాథోడ్ రమేశ్ 1999 లో టీడీపీ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో అదే పార్టీ తరఫున ఆదిలాబాద్ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడి బీఆర్ఎస్లో చేరిన ఆయన అనంతర పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2019లో ఆదిలాబాద్ఎంపీగా పోటీ చేయగా ఓటమే ఎదురైంది. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.