అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్ల ఆర్థిక సాయం
కేంద్ర బడ్జెట్లో ఏపీపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్ల ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించింది.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు పోలవం జీవనాడి అన్నారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందన్నారు. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు
విశాఖ-చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు, ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు.ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు.