వరద సహాయక చర్యల కోసం గవర్నర్ రూ. 30 లక్షల విరాళం
తన నిధుల నుంచి రూ. 30 లక్షలు రెడ్ క్రాస్ సొసైటీకి ఇచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
By : Raju
Update: 2024-09-03 13:58 GMT
వరద సహాయక చర్యల కోసం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రూ. 30 లక్షల విరాళం ఇచ్చారు. తన నిధుల నుంచి రూ. 30 లక్షలు రెడ్ క్రాస్ సొసైటీకి ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ ప్రజలను కోరారు. రెడ్ క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎస్ఎస్ఎస్, ఎన్టీవోలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు. భయాందోళనలు అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. బాధితులకు అన్ని విధంగా అండగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని గవర్నర్ ఆదేశించారు.