విద్యుత్ అధికారులపై వేటు
వివిధ కారణాలతో సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
By : Naveen Kamera
Update: 2024-09-03 15:31 GMT
విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న పలువురు అధికారులపై వేటు వేశారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కస్టమర్ల నుంచి కంప్లైంట్లు రావడం, అవినీతికి పాల్పడటం, డ్యూటీకి హాజరుకాకపోవడం లాంటి కాణాలతో నలుగురు అధికారులను చర్యలు తీసుకుంటూ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఈఈ అంబేద్కర్ ను కార్పొరేట్ ఆఫీస్ కు అటాచ్ చేశారు. నార్సింగి ఏఈ సందీప్రెడ్డి సస్పెండ్ చేశారు. ఇబ్రహీంబాగ్ డీఈ శివశంకర్, అక్కడే పని చేస్తున్న అడిషినల్ అసిస్టెంట్ ఇంజనీర్ జ్ఞానేశ్వర్ రావులకు చార్జిషీట్ జారీ చేశారు.