ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ: పొన్నం

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ రావడంపై స్పందించిన మంత్రి పొన్నం

By :  Raju
Update: 2024-08-27 13:45 GMT

కవితకు బెయిల్ అందరూ ఊహించిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కైతేనే కవితకు బెయిల్‌ వచ్చిందన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని నాటి నుంచే చెబుతున్నాం. రాజకీయ లబ్ధి కోసం బీజేపికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని మంత్రి విమర్శించారు. జైలులో ఉన్న కవితను విడిపించుకోవడానికి బీజేపీ శరణు కోరారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ వారి స్నేహం బైటపడిందని ఆరోపించారు.

Tags:    

Similar News