తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి

దొడ్డి కొమురయ్య 78 వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో చిత్రపటానికి పూలమాల వేసి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు .

By :  Vamshi
Update: 2024-07-04 11:10 GMT

సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు . తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం అని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు.

తెలంగాణ సాయుధ పోరులో తొలి అమ‌రుడైన దొడ్డి కొముర‌య్య త్యాగం చిరస్మర‌ణీయ‌మ‌ని, ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు. నియంతృత్వ పాల‌న నుంచి విముక్తికి సాగిన సాయుధ పోరాటం నుంచి స్ఫూర్తిని పొంది వారి ఆశ‌యమైన ప్రజా పాల‌న సాగిస్తున్నామ‌న్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లేజిస్లేచర్ సెక్రటరీ డా" నరసింహా చార్యులు ,సీఎల్పీ కార్యదర్శి శ్రీకాంత్ , ఛీప్ మార్షల్ కరుణాకర్ , శాసన మండలి ,శాసన సభ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు .

Tags:    

Similar News