2026 మార్చి లోపు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్

ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ములుగు జిల్లాలో మంత్రులతో కలిసి దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు.

By :  Vamshi
Update: 2024-08-30 12:39 GMT

ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ములుగు జిల్లాలో మంత్రులతో కలిసి దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు.దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క సందర్శించారు. మార్చి 2026 లోపు వంద శాతం దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. మార్చి నెలలో సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభింస్తామని వారు తెలిపారు. ప్రాజెక్ట్‌ల పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 1.81 లక్షల నిధులు ఖర్చుపెట్టారని పేర్కొన్నారు. ప్రతీ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని వారు తెలిపారు. రైతుల విషయంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మాకు ప్రాధాన్యత ఉందని చెప్పడానికి ఇవాళ దేవాదుల ప్రాజెక్టును సందర్శించడమే నిదర్శనమని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ ప్రాజెక్టును 2008లో వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత 15 ఏళ్లుగా నత్తనడకన నడుస్తున్నదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేందుకు ఇంకా 3 వేల ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని, ఇంకా రూ.11.50 రూ. కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు.

ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం రైతులను రాజును చేసేందుకు వారికి అన్నిరకాల సహాయం చేసేందుకు నీటి పారుదల ప్రాజెక్టులకుగ్రీన్ చానల్ ద్వారా నిధులు కేటాయిచబోతున్నామన్నారు. అలాంటి వాటిలో ఈ దేవాదుల ప్రాజెక్టు కూడా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ విషయంలో ఛత్తీస్ గఢ్ తో సమస్య ఉందని ఈ సమస్యకు పరిష్కారం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ఇవాళ చత్తీస్ గఢ్ కు వెళ్లారన్నారు. ఈ సమస్యకు ప్రక్క రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణంలో శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకు ముందు ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని ఉమ్మడి వరంగల్ తో పాటు పాత నల్గొండ, పాత ఖమ్మంలోని కొంత ప్రాంతాలకు నీటిని ఇస్తామన్నారు.

Tags:    

Similar News