కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్‌

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బయలుదేరి వెళ్లారు. గతంలో జనసేన అధ్యక్షుడి హోదాలో కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్‌ ఈసారి డిప్యూటీ సీఎం హోదాలో వెళ్తున్నారు

By :  Raju
Update: 2024-06-29 04:57 GMT

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌ లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు పయనమయ్యారు. బయలుదేరే ముందు తన నివాసానికి వచ్చిన అభిమానులకు పవన్‌ అభివాదం చేశారు.

ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ మొక్కులు చెల్లించుకోవడానికి కొండగట్టుకు వెళ్తున్నారు. గతంలో జనసేన అధ్యక్షుడి హోదాలో కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్‌ ఈసారి డిప్యూటీ సీఎం హోదాలో వెళ్తున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. కొండగట్టుకు పవన్‌ వస్తుండటంతో ఆయనను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు వస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు.




 


తన ఇష్టదైవమైన ఆంజనేయస్వామిని పవన్‌ కల్యాన్‌ ఇప్పటికే పలుసార్లు దర్శించుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన ఎన్నికల ప్రచార రథరమైన వారాహికి కొండగట్టు ఆలయంలోనే పవన్‌ పూజలు చేయించిన విషయం విదితమే.అభిమానులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని జనసేన నేతలు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News