శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దర్శించుకున్నారు

By :  Vamshi
Update: 2024-08-11 06:37 GMT

తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం తెల్లరుజామున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు పుర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశ్వీచనం చేసే స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. పాడి పంటలతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్ధించినట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

Tags:    

Similar News