పచ్చి మోసం చేసే పార్టీ కాంగ్రెస్‌ పార్టీ: కిషన్‌రెడ్డి

కల్యాణలక్ష్మీ అందరికీ ఇస్తామని, ఆ నగదుతో పాటు సోనియాగాంధీ పేరుతో తులం బంగారం ఇస్తామని కాంగ్రస్‌ పార్టీ వాగ్దానం చేసింది. ఇట్లా అనేక హామీల ఇచ్చింది. కానీ ఇచ్చిన మాట ఏనాడు కాంగ్రెస్‌ పార్టీ నిలబడలేదని విమర్శించారు.

By :  Raju
Update: 2024-07-09 07:45 GMT

హైదరాబాద్‌లో ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద మహిళా మోర్చా ధర్నా నిర్వహించింది. 'కానరాని మహిళా గ్యారెంటీలు-కదం తొక్కిన మహిళలు' అనే నినాదంతో చేపట్టిన ఈ ధర్నాలో భారీగా బీజేపీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నేతృత్వంలో ఈ ధర్నా కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయ్యింది. మహిళలకు రేవంత్‌రెడ్డి బాకీ పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటివరకు ప్రతి మహిళకు కాంగ్రెస్‌ పార్టీ రూ. 20000 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. . కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీపై ఇప్పటివరకు అతీగతీ లేదని దీని గురించి కాంగ్రెస్‌ పార్టీ మాట ముచ్చట లేదన్నారు. మహిళలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. మహిళలకు రూ. 2500, వృద్ధులకు రూ. 4000 ఎప్పుటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు . రైతు కూలీలలో ఎక్కువ మంది మహిళలు ఉంటారు. వాళ్లకు కూడా రూ. 12 వేలు ఇస్తామన్నారు. దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే పింఛన్లు రూ. 4000 ఇస్తామని హామీ ఇచ్చారు. చదువుకునే 18 ఏళ్లు దాటిన అమ్మాయిల అందరికీ ఎలక్ట్రికల్‌ స్కూటీలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్క స్కూటీ ఇచ్చిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. వంట గ్యాస్‌ రూ. 500 లకే ఇస్తామన్న హామీ ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. అలాగే కల్యాణలక్ష్మీ అందరికీ ఇస్తామని, ఆ నగదుతో పాటు సోనియాగాంధీ పేరుతో తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ వాగ్దానం చేసింది. ఇట్లా అనేక హామీల ఇచ్చింది. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నా మహిళలకు న్యాయం జరగలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలకు రిజర్వేషన్లు కల్పించామన్నారు కానీ ఇచ్చిన మాట ఏనాడు కాంగ్రెస్‌ పార్టీ నిలబడలేదని విమర్శించారు. . పచ్చి మోసం చేసే పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని ఆరోపించారు.

Tags:    

Similar News