కవితపై అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్కు ఫిర్యాదు
జైలు నుండి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరేళ్ల శారదకు కంప్లైంట్ చేశారు.
జైలు నుండి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరేళ్ల శారదకు కంప్లైంట్ చేశారు. కవితపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం, మార్ఫింగ్లపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ కవితపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు చైర్పర్సన్కు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీతాఫల్మండి కార్పొరేటర్ సామలహేమ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నాయకులు ట్విట్టర్లో ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి మహిళా కమిషన్కి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.