నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ సమీక్ష

నేషనల్ హైవేలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇవాళ సచివాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు.

By :  Vamshi
Update: 2024-07-10 09:51 GMT

జాతీయ రహదారులు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణలో పలు అంశాలపై సీఎం అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్స్ సభ్యుడు అనిల్ చౌదరి ఆధ్వర్యంలో అధికారుల బృందం నిన్న సీఎంతో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న ఆర్ఆర్ఆర్‌ ప్రాజెక్టుకు తోడ్పాటు అందించాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, జాతీయ రహదారులు నిర్మాణం సాగుతున్న ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధింత ఉన్నతాధికారులు పాల్గోన్నారు

Tags:    

Similar News