గృహ జ్యోతి పథకం అమలుపై సీఎం రేవంత్ సమీక్ష

విద్యుత్ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ రాబడి, డిస్కమ్స్, రెవెన్యూ లోటు, ఇతర అంశాలపై చర్చించారు.

By :  Vamshi
Update: 2024-09-04 15:58 GMT

విద్యుత్ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ రాబడి, డిస్కమ్స్, రెవెన్యూ లోటు, ఇతర అంశాలపై చర్చించారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కరెంట్‌లో వచ్చే రాబడి, డిస్కమ్స్ రెవెన్యూ లోటు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

గృహ జ్యోతి పథకం అమలు నిరంతరంగా నాణ్యమైన కరెంట్ సరఫరా ఇతర అంశాలను అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశాం. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ట్రాన్స్ కో సీఎండీ రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాంతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News