ఖమ్మం పర్యటనకు సీఎం రేవంత్‌ రెడ్డి

రాత్రికి అక్కడే బస.. రేపు మహబూబాబాద్‌ జిల్లాలో పర్యటన

Update: 2024-09-02 07:59 GMT

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు సీఎం రేవంత్‌ రెడ్డి బయల్దేరారు. సోమవారం మధ్యాహ్నం పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మంత్రులు, అధికారులతో కలిసి రోడ్డు మార్గంలో ఆయన బయల్దేరారు. సాయంత్రం ఖమ్మం జిల్లాకు చేరుకుని వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి మంగళవారం ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇతర వరద ప్రభావ ప్రాంతాలను పరిశీలించి అక్కడి నుంచి మహబూబాబాద్‌ జిల్లాకు చేరుకుంటారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆకేరు, మున్నేరు వాగులు పొంగడంతో నష్టపోయిన గ్రామాలను సీఎం పరిశీలిస్తారు. హైదరాబాద్‌ కు తిరుగు ప్రయాణంలో మంగళవారం సాయంత్రం కోదాడకు వెళ్లారు. నీట మునిగిన కోదాడ పట్టణంతో పాటు సమీప ప్రాంతాల్లో పర్యటించి మంగళవారం రాత్రికి హైదరాబాద్ కు తిరిగి వస్తారు.

Tags:    

Similar News