ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ అంశాలపై ప్రధాన చర్చ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయణమయ్యారు.

By :  Vamshi
Update: 2024-08-15 15:43 GMT

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పయణమయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి వెళ్లారు. రేపు ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్తున్నారు. రెండు రోజుల పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. కాగా, ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం మరోసారి ఢిల్లీకి వెళ్లనుండడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కేబినెట్ విస్తరణపైనా హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.

Tags:    

Similar News