ఈ నెల 16న కలెక్టర్లు,ఎస్పీలతో సీఎం సమావేశం
ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.
By : Raju
Update: 2024-07-12 04:55 GMT
ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు. బదిలీల ప్రక్రియ, ఉన్నతాధికారుల బదిలీలు పూర్తయి. ఈ నేపథ్యంలో సమావేశం జరనున్నది.
ఈ సమావేశంలో చర్చించే అజెండా అంశాలను ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసింది.
ఎజెండా అంశాలు:
-ప్రజా పాలన.
-ధరణి.
-వ్యవసాయం - కాలానుగుణ పరిస్థితులు.
-ఆరోగ్యం- సీజనల్ వ్యాధులు.
-వన మహోత్సవం.
-మహిళా శక్తి.
-విద్య.
-లా & ఆర్డర్ మరియు సెక్యూరిటీ సంబంధిత సమస్యలు.
-మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం.
అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు సంబంధిత సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సూచించింది.