సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
ఆమ్ ఆద్మీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లిక్కర్ పాలసీ కేసులో చుక్కెదురైంది.
By : Vamshi
Update: 2024-07-12 09:37 GMT
ఢిల్లీ మద్యం పాలసీపై సీబీఐ పెట్టిన కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జుడీషయల్ కస్టడీని ఈనెల 25 వరుకు అవెన్యూ కోర్టు పొడిగించింది. జూలై 12న ఉదయమే ఈడీ నమోదు చేసీన మనీలాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా.. లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ కేసులో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ కోర్టుకు హాజరైయ్యారు. ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. జూలై 25 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ఆయన విచారణ ఇంకా కొనసాగనుంది.
CM Kejriwal's custody extended in CBI case