చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ కన్నుమూత

చిరంజీవి కుమార్తె శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు.

By :  Vamshi
Update: 2024-06-19 06:43 GMT

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా లంగ్స్ డ్యామేజ్‌‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. శ్రీజను 2007లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ పెళ్లీ అప్పట్లో హాట్ టాఫీక్‌గా మారింది. అనంతరం వీరిద్దరు మధ్య విభేదాలు రావడంతో 2014లో చట్టబద్దంగా విడాకులు తీసుకున్నారు. 2016లో శీజా, కళ్యాణ్‌ను వివాహం చేసుకుంది. శిరీష్-శ్రీజ జంటకు ఒక పాప ఉంది. వారు డైవర్స్ తీసుకున్న తర్వాత పాప శ్రీజ వద్ద ఉంటుంది. ఆయన మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మరోవైపు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ 2019లో మరో వివాహం చేసుకున్నారు. అనంతరం బీజేపీలో చేరి రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు.

  

Tags:    

Similar News